ఆంధ్రప్రదేశ్‌

ఏవోబీలో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, డిసెంబర్ 15: ఏవోబీలో బీఎస్‌ఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు వద్ద లభించిన ఆయుధాలు, కిట్ బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించేందుకు మల్కన్‌గిరి జిల్లా పోలీసులు తమ కార్యాలయానికి తరలించారు.
బీఎస్‌ఎఫ్ జవాన్లు అందించిన వివరాల ప్రకారం మల్కన్‌గిరి జిల్లా సప్పర్‌మెట్ల పోలీస్ స్టేపన్ పరిధి బంధుగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారం గురువారం సాయం త్రం బోడపొదర్ బీఎస్‌ఎఫ్ ఇంటిలిజెన్స్ వర్గాలకు అందింది. దీనిని నిర్ధారించుకున్న పోలీసులు ఆ సమావేశ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరుపగా, అటువైపు నుంచి మావోయిస్టులు కాల్పులకు దిగారు.