ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి ఆ సామర్థ్యం లేదు: పురంధ్రీశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు, డిసెంబర్ 16: పోలవరం ప్రాజెక్టును నిర్మించే సామర్థ్యం రాష్ట్రానికి లేదని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శనివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ప్రచారం చేయడం తగదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 72 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయినా కేంద్రంపై తెలుగుదేశం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు సమర్థవంతంగా చేపట్టే కంపెనీకి టెండర్లు ఇవ్వనందునే పనుల్లో జాప్యం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అందుకే పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారన్నారు.