ఆంధ్రప్రదేశ్‌

ఏపీలోనూ తృణమూల్ కాంగ్రెస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు పార్టీ ఏపీ కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి మొహిద్దీన్ బేగ్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వంలో ఉన్న తమ పార్టీ యూపీ, మణిపూర్, త్రిపురలో కూడా రాజకీయంగా ప్రభావాన్ని చూపుతోందన్నారు. జాతీయ పార్టీ హోదా కలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ముందుగా విశాఖ, విజయవాడ, తిరుపతిలో పార్టీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించామని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ బాధ్యతలను తీసుకున్నారని ఆయన చెప్పారు. జనవరి అయిదోతేదీన మమతాబెనర్జీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో పార్టీని స్థాపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏపీలో ఏ పార్టీకి సంబంధం లేని కొత్త వ్యక్తులను పార్టీలోకి తీసుకోనున్నామని బేగ్ చెప్పారు. ముఖ్యంగా విద్యావేత్తలు, మేధావులను తీసుకుంటామని చెప్పారు. మహిళలకు, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల బరిలోకి పార్టీని దింపేందుకు కసరత్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీకి మెరుగైన ఓట్లు వచ్చే అవకాశం ఉందని బేగ్ వివరించారు.