ఆంధ్రప్రదేశ్‌

సర్వదర్శనానికి నేటినుంచి టైమ్‌స్లాట్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 17: సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమలలో అమలుచేయనున్న ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానానికి ఏర్పాట్లు పూర్తయినట్లు టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం కౌంటర్లలోని టోకెన్లు జారీ చేస్తామని, భక్తులు ఆధార్ కార్డు చూపి టోకెన్లు పొందాలని కోరారు. ఆదివారం తిరుమలలోని నందకం విశ్రాంతిగృహం, ఆర్టీసి బస్టాండ్ ప్రాంతాల్లోని కౌంటర్లల పనితీరును జే ఈ ఓ శ్రీనివాసరాజుతో కలసి ఈ ఓ అనిల్‌కమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ రూ. 300 ప్రత్యేకదర్శనం భక్తులు రోజుకు 15వేల నుంచి 20 వేల మంది, నడకదారి భక్తులు దాదాపు 20వేల మంది కలిపి సరాసరి 35వేల మంది భక్తులు నిర్దేశిత సమయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారని అన్నారు. ఈసందర్భంగా సర్వదర్శనం భక్తుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. సోమవారం నుంచి ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా టోకెన్లు మంజూరుచేస్తామని, ఈ విధానంపై భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించి లోటుపాట్లను సవరించుకుంటామని వెల్లడించారు. ఈ విధానం ద్వారా భక్తులు నుంచి అభిప్రాయాలను సేకరించి లోటుపాట్లను సవరించుకుంటామని చెప్పారు. మార్చినెల నుంచి పూర్తిస్థాయిలో సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. నిర్దేశిత సమయానికి దివ్యదర్శనం కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే ఒకటిన్నర గంటలోపే స్వామివారి దర్శనం కల్పిస్తామని తెలియజేశారు.