ఆంధ్రప్రదేశ్‌

నారావారిపల్లెలో మనవడితో బాలయ్య సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జనవరి 14: తెలుగు వారి జీవితాల్లో భోగి పండుగ ఆనందాన్ని, సుఖ సంతోషాలను నింపాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. నారావారి పల్లెలో తన వియ్యంకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి బాలకృష్ణ దంపతులు వచ్చారు. బాలకృష్ణ ఆదివారం ఉదయం ఇంటి ముందు భోగి మంట వేశారు. ఆయనతోపాటు ఆయన సతీమణీ వసుంధర, కొడుకు మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు పల్లె సీమల్లోనే కనువిందు చేస్తాయన్నారు. ఈసందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై తన మనవడిని కూర్చోపెట్టుకుని బాలకృష్ణ కొంతదూరం బండి నడిపారు.

చిత్రం..మనవడు దేవాన్హ్‌తో కలిసి ఎడ్లబండిపై బాలకృష్ణ