ఆంధ్రప్రదేశ్‌

రాజన్నకు బట్టలు పెట్టి నివాళులు అర్పించిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జనవరి 16: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ సంక్రాంతి సందర్భంగా తన తండ్రి జ్ఞాపకార్థం పెద్దలకు బట్టలు సమర్పించారు. జిల్లాలోని రామచంద్రాపురం మండలం పారకాల్వ గ్రామ సరిహద్దులో ఏర్పాటుచేసిన విడిదిలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వేదిక పైన ఉంచారు. మకర సంక్రాంతి పర్వదినాన అభిమానులతో కలిసి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్‌రెడ్డికి కొత్త బట్టలు పెట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విడిది ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. రంగు రంగుల రంగవల్లులతో తీర్చిదిద్దారు. గంగిరెద్దుల ఆటవారు గంగిరెద్దులతో విన్యాసాలు చేయించారు. మహిళలు గొబ్బెమ్మలు తట్టి గ్రామాలలోని పాత తరాలను ముందుకు తెచ్చారు. గ్రామాలలోని పూరి గుడిసెల నమూనాలను ఏర్పాటుచేసి గ్రామీణ వాతావరణం కల్పించారు.

చిత్రం..రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎదుట కొత్తబట్టలు పెడుతున్న
జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజా తదితరులు