ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రితో కుప్పం వాసుల ఆత్మీయ సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 20: కుప్పం నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం కలుసుకున్నారు. విహార యాత్రకు వస్తూ ఆంధ్రప్రదేశ్ సచివాలయ సందర్శనకు వచ్చామని వారు వివరించారు. ఏఏ ప్రదేశాలు చూసి వచ్చారో ఈ సందర్భంగా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. తన నియోజకవర్గ ప్రజలతో సరదాగా సంభాషిస్తూ బెంగుళూరు మీకు దగ్గర కదా? బెంగుళూరు చూశారా? చెన్నయ్ సందర్శించారా? అని ప్రశ్నించారు. కుప్పం మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ కె.వసంతమ్మ ఆధ్వర్యంలో శాంతిపురం, కుప్పం నుంచి 70 మంది తరలి వచ్చారు. అదే నియోజకవర్గం నుంచి వచ్చిన జి.రమేష్, టి.వెంకటరమణ, జి.ప్రభాకర్ తదితరులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరినీ పేరు పేరునా పలకరించారు. సందర్శకులలో తనను ఆకట్టుకున్న నూలకుంటకు చెందిన రెండో తరగతి చదువుతున్న బాలిక హేమను ముఖ్యమంత్రి పేరేమిటి? ఏమి చదువుతున్నావు? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఆ చిన్నారి ముద్దుముద్దుగా సమాధానమివ్వటంతో ముఖ్యమంత్రి ముగ్ధులయ్యారు. శాలువా కప్పి సత్కరించారు.

చిత్రం..రెండో తరగతి చదువుతున్న బాలికను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి