ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీపంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జనవరి 22: శ్రీపంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ సోమవారం భక్తులకు శ్రీ సరస్వతీ దేవి దివ్య అలంకారంతో దివ్య దర్శనం మిచ్చింది. ఈచదువుల తల్లిఆశీస్సులను పొందటానికి స్కూళ్లు, కళాశాలలకు చెందిన విద్యార్థులు వేకువ జామునుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. జ్ఞానాన్ని అందించే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మనక్షత్రం సందర్భంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానం అధికారులు ‘విజరుూభవ’ పేరుతో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షల్లో అందరు విద్యార్థులు అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అంతరాలయంలో ఉన్న మూల విరాట్‌తోపాటు, ఉత్సవ మూర్తికి సైతం శ్రీసరస్వతీదేవి అలంకారం చేశారు.