ఆంధ్రప్రదేశ్‌

వేడుకగా పోలమాంబ తొలేళ్ల ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, జనవరి 22: విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరకు సంబంధించి సోమవారం తొలేళ్ల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. మంగళవారం నిర్వహించే సిరిమానోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం ఆర్డీవో సుదర్శనదొర పర్యవేక్షణలో ఆదివారం రాత్రి అమ్మవారి ఘటాలను ఉరేగించాక సోమవారం రాత్రి తొలేళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. వేలాదిమంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగింది. ఇదిలా ఉండగా జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 900 మంది పోలీసులను బందోబస్తుగా నియమించారు. మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులుగా భారీగా తరలివచ్చారు.