ఆంధ్రప్రదేశ్‌

గాలి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: మైనింగ్ కేసులో లభించిన బెయిల్‌పై ఉన్న షరతులను సడలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి చేసుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జనార్దన రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఆశోక్‌భూషన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. బెయిల్ నిబంధనలను సడలించేందుకు ధర్మాసనం నిరాకరించింది. 2011 సెప్టెంబరు ఐదున గాలి జనార్దన్ రెడ్డి అనంతపురం జిల్లా పరిధిలో ఓఎంసీ కంపెనీల గనుల్లో జరిగిన అక్రమాల కేసులో నిందితుడిగా చేస్తూ సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులను సడలించాలని గాలి చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.