ఆంధ్రప్రదేశ్‌

పకడ్బందీగా ఇంటర్ ప్రాక్టికల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, మరింత పారదర్శకంగా పరీక్షలను నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన కాకినాడ జెఎన్‌టీయూ సమావేశ మందిరం నుండి ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో ప్రాక్టికల్ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలన్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని త్రి గంటా స్పష్టం చేశారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష 27న, అదే విధంగా ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 29న జరుగుతుందన్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సెంటర్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రతి ల్యాబరేటరీలోనూ 2 సీసీటీవీ కెమెరాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 21వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయని మంత్రి గంటా తెలిపారు. గతంలో విద్యార్థులకు జంబ్లింగ్ విధానం ఉండేదని, ఇప్పుడు విద్యార్థులకు, ఇన్విజలేటర్లకు కూడా జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. గతంలో మూడు రోజులకు ఒక్కసారి ఇన్విజలేటర్లను మార్చేవారని, కానీ ఇప్పుడు ప్రతి రోజు వారిని మార్చే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. విద్యార్థులు నేలపైన కూర్చొని పరీక్షలు రాస్తే సహించేది లేదని, అవసరమైతే నిధులు తీసుకొని పూర్తి స్థాయిలో విద్యార్థులకు వౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా మంత్రి గంటాకు ఆర్‌జేడీలు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ బీ ఉదయలక్ష్మీ, అర్‌జేడీలు, అన్ని ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.