ఆంధ్రప్రదేశ్‌

ఏమ్మా.. ఫోన్ సౌకర్యం ఎలా ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి/మారేడుమిల్లి, జనవరి 23: జాజివలస.. కొండలు, కోనల నడుమ మారుమూల జనజీవన స్రవంతికి దూరంగా, కనీసం ఫోను సదుపాయానికి కూడా నోచుకోకుండా ఉన్న గ్రామమది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని వై.రామవరం మండలం, కనివాడ పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం ఇప్పటివరకు ఎవరైనా వెళితే కనీసం మాట్లాడటానికి ఎలాంటి ఫోను సదుపాయం, నెట్ కనెక్షన్ ఉండేది కాదు. అలాంటి గిరిజన ప్రాంతాన్ని అక్కడ ప్రజలు ఏ మాత్రం ఊహించని విధంగా దావోస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా వీడియో ఫోను ద్వారా పలుకరించి, వారి యోగక్షేమాలు అడిగేసరికి జాజివలస ప్రజలు పులకించిపోయారు. రంపచోడవరం నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పల్లెను తొలిసారిగా మంగళవారం ఫోను, ఇంటర్నెట్, కేబుల్ టీవీ సదుపాయాలు పలకరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థ వ్యయప్రయాసలకు ఓర్చి ఈ మారుమూల గిరిజన గ్రామాన్ని సాధారణ జనంతో మమేకమయ్యేలా కనెక్టివిటీ కల్పించింది. జాజివలసకు కల్పించిన ఈ సదుపాయాన్ని ముఖ్యమంత్రి దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జాజివలసకు కల్పించిన నవ సాంకేతిక సదుపాయం పనితీరు ఎలా ఉందో స్వయంగా అక్కడ గిరిజనులతో మాట్లాడి తెలుసుకున్నారు. జాజివలస ప్రజలతో ఫోను ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ‘ఏమమ్మా ఈ సదుపాయం ఎలా ఉంది, దీని ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని అనుకుంటున్నారని’ ఆయన గిరిజనులను అడిగారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కలలో కూడా ఊహించని విధంగా స్వయంగా ఇలా ముఖ్యమంత్రి తమను పలుకరించే సరికి ప్రజలు ఆనంద డోలికల్లో తేలిపోయారు. ‘సారూ.. చాలా సంతోషం సారూ, మీరు మాతో ఇలా మాట్లాడటం, మా ఊరికి ఫోను ఇచ్చినారు మీరు, మీకు కృతజ్ఞతలు’ అని జాజివలస మహిళలు తెలిపారు. తమ ఊరికి ఊహించని విధంగా రోడ్డు కూడా వేస్తున్నారని అది తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. దానికి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ఒక్క ఫోను ఏంటమ్మా మీ ఊరికి ఇప్పుడు ఇంటర్నెట్, కేబుల్ టీవీ అన్నీ వచ్చాయి. టెలీ మెడిసిన్ ఒక్కటేమిటీ, దీనివల్ల మీకు తెలియని ప్రయోజనాలు ఎన్నో కలగబోతున్నాయని’ అన్నారు. జాజివలసకు ఫైబర్ నెట్ సదుపాయం కల్పించడం తనకు చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
ఫైబర్ నెట్‌కు అభినందనలు
జాజివలస గిరిజన గ్రామానికి వైర్‌లెస్ నెట్ సదుపాయాన్ని దిగ్విజయంగా కల్పించిన ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ సంస్థను, ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అహ్మద్‌బాబు, అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. ‘గుడ్ చాలా బాగా చేశారు, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఇలా ఏ మాత్రం కనెక్టెవిటీ లేని ప్రాంతాలకు ఇదే తరహా కనెక్టివిటీని కల్పించాలని’ సూచించారు. జాజివలసకు ఈ సదుపాయం ఎలా కల్పించిందీ ఫైబర్‌నెట్ సీఈఓ ఎ.బాబు వివరించారు.
ప్రపంచంలోనే తొలిసారి...
ఏ మాత్రం కమ్యూనికేషన్ సదుపాయం కల్పించడానికి అవకాశం లేని మారుమూల ప్రాంతాలకు కూడా ఇలా ఏకంగా టెలిఫోను, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సదుపాయాన్ని వైర్‌లెస్ ద్వారా కల్పించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని ఫైబర్ నెట్ వర్గాలు తెలిపాయి. దీనికోసం ఫైబర్ నెట్ సంస్థ గూగుల్ ఎక్స్ సంస్థ సహకారం తీసుకుని ఎఫ్‌ఎస్‌ఓసీ ద్వారా ఈ సదుపాయం కల్పించింది. దీనికోసం ఏపీ ఫైబర్ నెట్ చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రంపచోడవరం ఐటీడీఏ పీవో దినేష్‌కుమార్, ఫైబర్ నెట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్న జాజివలస గిరిజనులు