ఆంధ్రప్రదేశ్‌

పవన్ జేఎఫ్‌సీ సమావేశానికి కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ఏర్పాటైన జేఎఫ్‌సీ (జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ) సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు. ప్రత్యేక హోదా సాధనతోపాటు రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్రంపై వత్తిడి తీసుకుచ్చేందుకు ఏర్పాటుచేసిన జేఎఫ్సీ తొలి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో జరుగునున్న నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్.. పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డికి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆ మేరకు కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ హాజరుకానున్నట్టు రఘువీరారెడ్డి తెలిపారు. సమావేశానికి లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ హాజరవుతున్న విషయం విదితమే.