ఆంధ్రప్రదేశ్‌

నేడు విజయవాడలో జేఎఫ్‌సీ రౌండ్ టేబుల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: జెఎఫ్‌సి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం జెఎఫ్‌సీ ఆధ్వర్యంలో హస్తినలోనే యుద్ధరంగమన్నారు. రాజమహేంద్రవరంలో సీపీఐ జిల్లా మహాసభల నేపధ్యంలో రాజమహేంద్రవరం వచ్చిన ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని, దేశంలో అవినీతి, లంచగొండి తనం పెరిగిపోయాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకుని వెళ్తామని, ఢిల్లీలో పోరాటాన్ని నిర్వహిస్తామన్నారు. బడ్జెట్‌లో ఏపీకి చేసిన అన్యాయాన్ని కేంద్రం తక్షణం సరిదిద్దాలన్నారు. విభజన హామీలు అమలు చేయాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి టీడీపీ, బీజేపీలే కారణమన్నారు. ఏప్రిల్ 6 నుంచి కడపలో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, ఏప్రిల్ 7న కడపలో భారీ స్థాయిలో రెడ్‌షర్టు ర్యాలీ నిర్వహించనున్నామన్నారు.