ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ ఎదుగుతుందనుకోటం అత్యాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందనుకోవడం అత్యాశేనని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదన్నారు. 2009లో లోక్‌సభకు సోము వీర్రాజు పోటీ చేస్తే 7 వేల ఓట్లే వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలకు రూ.24 వేల కోట్లకు గాను 1050 కోట్లు ఇచ్చారని చెప్పారు. అమరావతికి రైతులు రూ.50 వేల కోట్ల విలువైన భూములు ఇస్తే కేంద్రం కేవలం రూ.1500 కోట్లు ఇచ్చిందని బొండా చెప్పారు.