ఆంధ్రప్రదేశ్‌

బీజేపీతో రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: భవిష్యత్తులో రాష్ట్రానికి బీజేపీ నుంచి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో పరిస్థితి చూస్తుంటే, విభజన నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు అవిశ్వాసంపై చర్చకు పెట్టి, మమ అనిపించే అవకాశం ఉందన్నారు. రాజ్యసభలో మెజారీటి లేకపోవడంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారన్నారు. లేదంటే ఇంకా ఇబ్బంది పెట్టేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక, రాహుల్ గాంధీ పరిణితి చెందారన్నారు.