ఆంధ్రప్రదేశ్‌

జిల్లాకో శిల్పా రామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: తెలుగు వైభవాన్ని ప్రతిబింబించే శిల్పారామాలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఏపీ పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో మాత్రమే ఉన్న శిల్పారామాన్ని విభజన తర్వాత ఇక్కడ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించారన్నారు. అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి అఖిలప్రియ సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకో శిల్పారామం ఏర్పాటు తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో కళలు, తెలుగుజాతి సంస్కృతి, వైభవాన్ని పునరుజ్జీవింప చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దళారులు లేకుండానే నేరుగా వారి ఉత్పత్తులు అమ్ముకోవచ్చని అన్నారు.