ఆంధ్రప్రదేశ్‌

నడిరోడ్డుపై హత్యాకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, జూన్ 28: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెన్నుబొట్లవారిపాలెం పల్లెలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అంతా చూస్తుండగానే తండ్రీకొడుకులు గొడ్డళ్లతో పల్లెకు చెందిన ముగ్గురిని దారుణంగా నరికి చంపారు. రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఉన్న పాత కక్షలే ఈ హత్యాకాండకు కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనలో కీర్తిపాటి రత్తయ్య (50), జంగా బాబు (45), జంగా సుశీల (40) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో బాబు, సుశీల భార్యాభర్తలు కాగా, రత్తయ్య..బాబుకు మేనమామ. పట్టపగలు మధ్యాహ్నం పనె్నండున్నర గంటల వేళ జనమంతా చూస్తుండగా, గొడ్డళ్లతో నడిరోడ్డుపై సాగిన ఈ స్వైర విహారం ప్రజల్ని భీతావహుల్ని చేసింది. గతంలో ఇదే పల్లెలో ఉండి ప్రస్తుతం చిన జాగర్లమూడిలో నివాసం ఉంటున్న దిడ్లా శ్యాంసన్ అతని కొడుకు దిడ్లా బాబు గొడ్డళ్లతో ఈ దాడికి పాల్పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య చాలాకాలంగా గొడవలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. హంతకులు జాగర్లమూడినుంచి రుణమాఫీ పత్రాలు తీసుకునే సాకుతో చెన్నుబొట్లవారిపాలెం వచ్చి హత్యాకాండ సాగించారు. అడ్డం వచ్చిన కీర్తి రత్తయ్య భార్యను కూడా చంపడానికి ప్రయత్నిస్తే తప్పించుకుని పారిపోయింది. నిందితులిద్దరూ గొడ్డళ్లతో పల్లెలోకి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా చంపేస్తామంటూ కేకలు వేశారని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా ఈ సంఘటనలో నిందితులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
chitram...
నడిరోడ్డుపై పడి ఉన్న మృతదేహాలు