ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం వినూత్న నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమడోలు, ఏప్రిల్ 12: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని రాష్టవ్య్రాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గురువారం కొరడాలతో స్వయంగా కొట్టుకుంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తొలుత ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే వీరాంజనేయులు భీమడోలు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. భీమడోలు అమ్మవార్ల దేవాలయానికి చేరుకుని ప్రత్యేక హోదా కోసం పూజలు చేశారు. తర్వాత బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకున్నందుకు తమ తప్పును మన్నించాలని కోరుతూ, దీనికి శిక్షగా స్వయంగా కొరడాలతో కొట్టుకుంటూ స్వయంగా శిక్షించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కె పెద్దిరాజు, ఎంపీపీ ఎం రామతులసమ్మ, సర్పంచ్ శిరీష యుగంధర్, ఎంపీటీసీ సభ్యుడు శేషగిరి, పుల్లయ్యనాయుడు, ఆర్ బుజ్జిగోపాల్ తదితరులు పాల్గొన్నారు.