ఆంధ్రప్రదేశ్
ఎల్లుండి ఏపీ బంద్: జగన్ పిలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 September 2016
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శనివారం రాష్ట్ర బంద్ కు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. బంద్ కు సంబంధించి వామపక్ష నాయకులతో మాట్లాడామని వెల్లడించారు. టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏవిధంగా అన్యాయం చేశారో అదేవిధంగా ఇప్పుడు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే వేలకొద్ది పరిశ్రమలు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.