ఆంధ్రప్రదేశ్‌

సింధుకు 3 కోట్లు, గోపీచంద్‌కు 50 లక్షల నజరానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన పివి సింధుకు 3 కోట్ల రూపాయలు, ఆమె కోచ్ గోపీచంద్‌కు 50 లక్షల రూపాయల నగదు నజరానా ఇవ్వాలని ఎపి మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినట్టు తెలిసింది. నవ్యాంధ్ర రాజధానిలో సింధుకు వెయ్యి గజాల ఇంటి స్థలం, బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు గోపీచంద్‌కు స్థలం ఇవ్వాలని కూడా సిఎం చంద్రబాబు ప్రతిపాదించారని సమాచారం. సింధుకు ఎపి ప్రభుత్వంలో గ్రూప్- వన్ అధికారి పోస్టును కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆమె స్వదేశానికి తిరిగి రాగానే విజయవాడలో భారీ ఎత్తున సన్మానించి నజరానాలను అందజేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు, ఈ మేరకు శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. క్యాబినెట్ సమాచారం ముగిశాక ఈ విషయాలను ముఖ్యమంత్రి అధికారికంగా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.