ఆంధ్రప్రదేశ్
అయోమయంలో ఎపి సచివాలయ ఉద్యోగులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 June 2016
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఎపి సచివాలయ ఉద్యోగుల తరలింపులో ప్రస్తుతం అయోమయ పరిస్థితి నెలకొందని ఎపి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ అన్నారు. ఈ నెల 27 నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని సిఎం చెబుతున్నారని, వివిధ శాఖల ఉద్యోగుల తరలింపుపై నిర్దిష్ట విధానాన్ని ఈరోజు ప్రకటిస్తారని వార్తలు వెలువడుతున్నాయని దీంతో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు చాలామంది తమ పిల్లలను అమరావతి ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చేర్పించారని, ఇళ్లకు అడ్వాన్సులు కూడా చెల్లించారని ఆయన అన్నారు. అమరావతిలో ఉద్యోగులు ఆశించన మేరకు హెచ్ఆర్ఎ ఇవ్వాలని, వీలైనంత త్వరగా ఉద్యోగుల తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు.