ఆంధ్రప్రదేశ్‌

త్వరలో బాబు రష్యా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 1: రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎపిని భ్రష్టు పట్టించిందని అన్నారు. ఎపి పెట్టుబడిదారులంటే అవినీతిపరులన్న ముద్ర వేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మన పారిశ్రామికవేత్తలపై ఉన్న మచ్చను తొలగించి, వారిని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన తమ చైనా పర్యటన విజయవంతమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదేనని విదేశీయులు భావిస్తున్నారని అన్నారు. తనతో మాట్లాడిన వారంతా హైదరాబాద్ గురించి అడిగారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని తను ఇప్పుడు దేశ విదేశాలకు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు చెప్పారు. టియాంజిన్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశంలో మొదటి రోజు పారిశ్రామికవేత్తలు, ప్రపంచ స్థాయి కంపెనీల సిఇఓలతో వరసగా భేటీ అయ్యామని అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో సిటీస్ బై డిజైన్, నాట్ ఆన్ డిమాండ్ అనే అంశంపై కీలకోపన్యాసం చేశానని చంద్రబాబు చెప్పారు. అలాగే షేపింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ అనే అంశంపై కూడా మాట్లాడానని అన్నారు. త్వరలో రష్యాలో విమాన రంగంపై సదస్సు జరగనుందని చంద్రబాబు చెప్పారు. దానికి తాను హాజరవుతానన్నారు.