ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో టిడిపి సమన్వయ కమిటీ భేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు:రాష్ట్రంలో ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకు తొలిసారిగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీ మంగళవారం జరిగింది. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తొలిభేటీ జరిగింది. ప్రభుత్వంలోని మంత్రులు, పార్టీకి చెందిన ముఖ్యనేతలు పదిమందితో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. మంగళవారంనాడు సమావేసానికి మంత్రులు యనమల, దేవినేని, అచ్చెన్నాయుడు హాజరుకాగా పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావు, యువనేత నారా లోకేశ్ హాజరయ్యారు. 30 నియోజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నామని, ఈ విషయంలో అటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.