జాతీయ వార్తలు

వంద గంట‌ల్లోనే జైషే ఉగ్ర‌వాదులు హ‌తం :ఇండియ‌న్ ఆర్మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీన‌గ‌ర్ : ఎవ‌రైనా తుపాకీతో కనిపిస్తే వాళ్ల‌ను వెంట‌నే కాల్చేస్తామ‌ని ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. కార్ప్స్ క‌మాండ‌ర్ క‌న్వ‌ల్జిత్ సింగ్ దిల్లాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్నింగ్ ఇచ్చారు. గ‌న్ ప‌ట్టుకుని తిరిగేవాళ్ల‌ను రూపుమాపేస్తామ‌న్నారు. పుల్వామా ఫిదాయిన్ దాడి జ‌రిగిన త‌ర్వాత వంద గంట‌ల్లోనే ఆ దాడికి కార‌ణ‌మైన జైషే ఉగ్ర‌వాదుల‌ను హ‌తం చేశామ‌న్నారు. దేశ‌వ్యాప్తంగా క‌శ్మీరీల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను దృష్టిలో పెట్టుకుని 14411 హెల్ప్‌లైన్‌ను స్టార్ట్ చేసిన‌ట్లు సీఆర్‌పీఎఫ్ ఆఫీస‌ర్ జుల్ఫీక‌ర్ హ‌స‌న్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో చ‌దువుతున్న క‌శ్మీరీ విద్యార్థుల‌కు భ‌ద్ర‌తా ద‌ళాలు అండ‌గా నిలుస్తున్నాయ‌న్నారు.