జాతీయ వార్తలు

అస్సాంలో నాలుగు చోట్ల పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: ఓ వైపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా మరోవైపు అస్సాంలో సోమవారం ఉదయం నాలుగుచోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వరుస పేలుళ్లతో జనం భీతావహులయ్యారు. ఉదయం 7 గంటలు దాటాక మొదటిగా లయ్‌పురిలో ఓ ప్రైవేటు స్కూలు వద్ద, ఆ తర్వాత దుందుమాలోని ఓ టీ ఎస్టేట్ వద్ద, ఆ తర్వాత మసువా, ఫిలోబరి ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. ఉల్ఫా- ఇండిపెండెంటు మిలిటెంట్లే ఈ పేలుళ్లు జరిపారని పోలీసులు చెబుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకే వరుస పేలుళ్లకు మిలిటెంట్లు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.