క్రైమ్/లీగల్

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, జూన్ 28 : పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో 55 సంవత్సరాలు వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి గురువారం రైలు కింద పడి మృతి చెందాడు. ప్రయాణీకులు, ట్రాక్‌మెన్ నారాయణస్వామి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. రైల్వే పట్టాలపై ఆ వ్యక్తి తల, మొండెం వేరు కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గుర్తు తెలియని వ్యక్తిగా నిర్దారించారు. మృతుని చేతిమీద గంగ లక్ష్మమ్మ అనే పచ్చబొట్టు వుందని, ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్‌ః 7013719418 సమాచారం అందించాలన్నారు.

పాముకాటుతో విద్యార్థిని మృతి
డీ.హీరేహాల్, జూన్ 28 : మండల పరిధిలోని మురడి గ్రామానికి చెందిన ప్రియాంక అలియాస్ ఉలిగమ్మ (13) పాముకాటుకు గురై గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. స్థానిక ఎంపీపీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ప్రియాంక బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే బంధువులు చికిత్స కోసం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు.

వ్యక్తి మృతదేహం లభ్యం
హిందూపురం రూరల్, జూన్ 28 : మండల పరిధిలోని మణేసముద్రం గ్రామ శివార్లలో నీటి కుంటలో గురువారం వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. మృతుడు కర్నాటక ప్రాంతం కర్నాటక సమీపంలోని చందన్‌దూరుకు చెందిన మంజునాథ్ (25)గా గుర్తించినట్లు తెలిపారు. మంజునాథ్ ఆచూకీ విషయంలో గౌరిబిదనూరు పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదు అయిందని తెలిపారు. మృతుడి వివరాలు తెలియడంతో ఇందుకు సంబంధించి కేసును గౌరిబిదనూరుకు బదలాయించినట్లు ఎస్సై చెప్పారు.