క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, ఆగస్టు 6: మండలంలోని అమిద్యాల గ్రామంలో కవిత(26) వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.. ఈసంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
* కుమారుడి సాక్ష్యంతో కటకటాల పాలైన వైనం
చిలమత్తూరు, ఆగస్టు 6: మండలంలోని కోట్లోపల్లిలో ప్రియుడితో కలసి భర్తధం కలిగి ఉంది. ఈ క్రమంలో గత మాసం జూలై 30వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో లక్ష్మి కిటికీ గుండా బయట ఉన్న వ్యక్తితో గుసగుసలాడుతోంది. ఈ సంఘటన చూసిన భర్త అక్కడకు వెళ్లి చూడగా బయట మరో వ్యక్తి ఉన్నట్లు గమనించి భార్యను కొట్టి ఇటువంటి వ్యవహారాలు వద్దని హితవు పలికాడు. అయితే తన ప్రియురాలు లక్ష్మీని కొట్టిన సంఘటనను చూసి భరించేలేక శ్రీ్ధర్ ఇంట్లోకి ప్రవేశించి ఆంజనేయులును కొట్టి చంపివేశాడు. ఈ సంఘటనను చూసిన లక్ష్మి కుమారుడు దర్శన్‌ను ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. వెంటనే అతని మృత దేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి కుశావతి నదిలో పూడ్చివేశారు. ఆ తరువాత బోయ శ్రీ్ధర్‌తో కలసి లక్ష్మి గ్రామం విడిచి వెళ్ళిపోయింది. తండ్రి హత్య సంఘటనను చూసిన దర్శన్ తన నాయనమ్మ నంజమ్మకు విషయం తెలియచేశాడు. వెంటనే వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందూపురం రూరల్ సీఐ వేంకటేశులు ఆధ్వర్యంలో ఎస్సై ప్రదీప్‌కుమార్, పోలీసులు శ్రీ్ధర్, లక్ష్మీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బాగేపల్లిలో ఉన్న ఇరువురిని అరెస్టు చేసి పోలీసులు ఆదివారం రాత్రే స్టేషన్‌కు తరలించారు. సోమవారం వారిని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ మృత దేహం ఆంజనేయులుదేనని బంధువులు నిర్ధారించారు. దీంతో తహసీల్దార్ మారుతీ, డాక్టర్ భాస్కర్‌రెడ్డిలు అక్కడే శవ పంచనామా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.