క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, అక్టోబర్ 2 : మండల పరిధిలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన రైతు కురుబ గాదిలింగ (40) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తన పొలానికి వెళ్లిన గాదిలంగ పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమణించిన గరుగు, పొరుగు రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తమై బళ్లారికి తరలించారు. బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య శారదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కుమార్తెలు మరియమ్మ, గీత, లక్ష్మి, కుమారుడు కృష్ణ ఉన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగమధు తెలిపారు.

అతిగా మద్యం తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి
హిందూపురం టౌన్, అక్టోబర్ 2 : హిందూపురం రైల్వేస్టేషన్ సమీపంలో అతిగా మద్యం తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు టూటౌన్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి వయసు దాదాపు 40 ఏళ్లు ఉంటుందని, ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మద్యం అతిగా తాగడం వల్లే మృతి చెంది ఉంటాడని సీఐ అభిప్రాయ పడ్డారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.