అనంతపురం

మోదీ, షాల మెప్పుకోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, అక్టోబర్ 21: ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాల మెప్పు కోసమే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. ఆదివారం నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేఖరులతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కాషాయం మాటున కషాయం వెళ్లగక్కుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కేంద్రం నుండి టీడీపీ బయటకు రాగానే పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాయలసీమ గురించి స్థానిక నాయకులు మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేస్తుండటంతో పోలవరం త్వరగా పూర్తవుతోందన్నారు. కమీషన్ల కోసం ముఖ్యమంత్రి వారం వారం పోలవరం వెళ్తున్నారంటూ కన్నా విమర్శించడం దౌర్భాగ్యమన్నారు. కమీషన్ల గురించి మీకు తెలిసినంతగా మాకు తెలియదన్నారు. కేంద్రం సహకారం లేకున్నా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. కేంద్రం నిధులు పక్కదారి పట్టి వుంటే విచారణ చేయించాలని సవాల్ విసిరారు.