క్రైమ్/లీగల్
టిప్పర్ను ఢీకొని వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 April 2018
చిలమత్తూరు, ఏప్రిల్ 5 : మండల పరిధిలోని పెద్దనపల్లి క్రాస్ వద్ద గురువారం ఉదయం ద్విచక్ర వాహనం టిప్పర్ను ఢీకొన్న ఘటనలో చంద్రమోహన్ (33) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తచెరువు మండలం మైలేపల్లి గ్రామానికి చెందిన చంద్రమోహన్ వ్యాపార నిమిత్తం గోరంట్ల వైపు నుంచి చెక్పోస్టుకు వెళ్తుండగా పెద్దనపల్లి క్రాస్ వద్ద టిప్పర్ పంక్చర్ కావడంతో రిపేరి చేసుకుంటున్న వాహనాన్ని గమనించక వెనుక వైపు నుండి వచ్చి టిప్పర్ను ఢీ కొన్నాడు. దీంతో చంద్రమోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.