హైదరాబాద్

భారత్ అంటే..? అంశంపై సంగోష్ఠి నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: సమాచార భారతి హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో ‘్భరత్ అంటే..? అంశంపై సంగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార భారతి అధ్యక్షులు టి. హరిహరశర్మ, కన్వీనర్ జి. వల్లీశ్వర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పనె్నండు గంటల 45 నిమిషాల వరకు నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ సభా ప్రాంగణంలో జరిగే ఈ సంగోష్ఠి కార్యక్రమంలో శ్రీ పీఠం అధిపతి శ్రీ స్వామి పరిపూర్ణానంద ఆశీఃప్రసంగం చేయనున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్య అతిధిగా హజరుకానున్నారు. దిల్లి విశ్వవిద్యాలయం విశ్రాంత ఎకనామిక్స్ ప్రొఫెసర్ డా. భజరంగ్‌లాల్ గుప్త ప్రధాన ఉపన్యాసకులుగా హజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి బి.సురేంద్ర హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.