ఆంధ్రప్రదేశ్
మానసిక క్షోభ అనుభవించారు:చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 September 2019
గుంటూరు:టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన గుంటూరు టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కోడెల శివప్రసాదరావు గత కొంత కాలంగా మానసిక క్షోభ అనుభవించారని, వైకాపా వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆయన మృతి తమ పార్టీకి తీరని లోటు అని అన్నారు. వైద్యుడిగా ఎంతోమందికి ప్రాణదానం చేసిన ఆయన ఇలా ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోవటం బాధ కలిగిస్తుందని అన్నారు. ఇలాంటి వేధింపులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఎలాంటి అనుమానాలకు గురిచేస్తుందోననే ఆనుమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.