ఖమ్మం
భక్తులతో భద్రాద్రి కిటకిట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 26 December 2015
భద్రాచలం, డిసెంబర్ 25: ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ సందర్భంగా వరుస సెలవు రోజులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంటల కొద్ది వేచి చూడాల్సి వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే 150కి పైగా నిత్య కల్యాణాలు జరిగాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం సిబ్బంది త్రాగునీరు అందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు ఆర్కె శ్రీవత్సవ రామయ్యను దర్శించుకున్నారు. అటు పర్ణశాల ఆలయ దర్శనం, పాపికొండల విహార యాత్రకు కూడా భక్తులు భారీగా తరలివెళ్లారు.