ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల సందడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 January 2016
విజయవాడ: భవానీ దీక్షల విరమణ సందర్భంగా శుక్రవారం రెండో రోజు కూడా ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. తెల్లవారు జామున రెండు గంటలనుంచే భవానీ భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో సాధారణ భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి హోమగుండాల్లో కొబ్బరికాయలు సమర్పించి భవానీ భక్తులు దీక్షలు విరమించారు.