జాతీయ వార్తలు

ప్రముఖులకు తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై:ముంబైలో జరుగుతున్న మేకిన్ ఇండియా వారోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల వేదికవద్ద అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అక్కడే ఉన్న పలువురు ప్రముఖులు తృటిలో ప్రమాదంనుంచి బయటపడ్డారు. వేదికను మంటలు చుట్టుముట్టగానే భద్రతాసిబ్బంది వారిని అక్కడినుంచి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వేదికపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవిస్, గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఎంపి,అలనాటి అందాలతార హేమమాలిని, అమీర్‌ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. ప్రమాదంలో ఇప్పటివరకూ ప్రాణనష్టం, గాయపడినవారి వివరాలేమీ తెలియలేదు.