జాతీయ వార్తలు
బిహార్ వరదల్లో 26మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 July 2016
పట్నా: బిహార్లో వరదల కారణంగా 26మంది మృతి చెందగా, పుర్నియా, కతిహర్, మధెపురా, అరేరియా, సహర్సా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 22లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విపత్తు కారణంగా పంటలతో పాటు గుడిసెలు, పలు పక్కా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న 3.89 లక్షల మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.కోషితో సహా పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాదాపు 83లక్షల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.