రాష్ట్రీయం

పుట్టినరోజు పిలుపులకు వెళ్లి మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది బాలుడు సహా
దంపతులు దుర్మరణం
విశాఖలో విషాదం
విశాఖపట్నం, నవంబర్ 28: ఐదు రోజుల్లో మా చిన్నారి మొదటి పుట్టినరోజు జరుపుతున్నాము.. అందరూ రావాలంటూ పిలుపులకు వెళ్లిన తల్లితండ్రులతో పాటు, ఆ బాలుడు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషాద సంఘటన విశాఖ నగరంలో శనివారం జరిగింది. నగర పరిధిలోని నాతయ్యపాలెం వద్ద ద్విచక్ర వాహనాన్ని వెనుకనుండి వచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదంలో బల్లిన రమణ (32), ఆయన భార్య మేనక (24), కుమారుడు లితిక్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో లితిక్ అక్క కుందన (2) ప్రాణాలతో బయటపడింది. నగరంలోని సుజాతానగర్‌లో ఉంటున్న రమణ కుమారుడు లితిక్ మొదటి పుట్టినరోజు డిసెంబర్ 2న జరగాల్సి ఉంది. ఈ వేడుకకు రావాలంటూ పరవాడ మండలం జాజులపాలెంలోని అత్తగారింటికి శనివారం ఉదయం వెళ్లి ఆహ్వానించి, తిరిగి వస్తుండగా సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మేనక అక్కడికక్కడే మృతిచెందగా, ఆసుపత్రికి తీసుకువెళుతుండగా రమణ చనిపోయాడు. చాలాసేపు మృత్యువుతో పోరాడిన బాలుడు లితిక్ కూడా రాత్రి ఆసుపత్రిలో కన్నుమూశాడు. కళ్లముందే కుటుంబం మొత్తం ప్రమాదంలో చనిపోయిన విషయం కూడా గ్రహించలేని స్థితిలో చిన్నారి కుందన బేల చూపులతో అమ్మా, నాన్నలకు ఏమైంది.. తమ్ముడు ఎక్కడ.. అంటూ అడుగుతుంటే సమాధానం చెప్పలేక బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.