జాతీయ వార్తలు
ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 May 2019
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం అధికంగా ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు విజయపథాన దూసుకుపోతున్నారు. అత్యధిక లోకసభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో సైతం ఎస్పీ, బీఎస్పీ కూటమి బీజేపీ ప్రభంజనాన్ని ఆపలేకపోయింది. ఇక్కడ 80 నియోజకవర్గాలు ఉండగా 56 స్థానాల్లో కమలం వికసిస్తోంది. నరేంద్ర మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్లో 26 స్థానాలు ఉండగా 22 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కర్ణాటకలో 28 స్థానాల్లో 22 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్లో 20 చోట్ల బీజేపీ హవా కొనసాగుతుంది.