జాతీయ వార్తలు
బీజేపీలో చేరిన విదేశాంగ మంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 June 2019
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 1977కు చెందిన ఈ ఐఎఫ్ఎస్ అధికారి మోదీ ప్రభుత్వంలో మూడేళ్లపాటు విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన మోదీ ఈసారి జయశంకర్కు కేంద్ర విదేశాంగ మంత్రిగా చోటు కల్పించారు. ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెశిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు.