రంగారెడ్డి

బిజెపిని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 19: మేడ్చల్ మండలంలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్ది మోహన్‌రెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మండల పార్టీ సమావేశాన్ని నిర్వహించి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిలుగా పాల్గొనవారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బిజెపియేనని పార్టీని అన్ని విధాలుగా పటిష్టం చేసేందుకు శ్రేణులు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోది సర్కార్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి జనరంజకమైన పాలన సాగిస్తూ అన్నివర్గాల ప్రజల మన్నలను చూరగొంటున్నారని దీనిని అసరాగా చేసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు అంకితభావంతో పని చేయాలని కోరారు. మోది ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతూ వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తీరును ప్రజలకు క్లుప్తంగా వివరించి వారికి మరింత చేరువ కావాలని పేర్కొన్నారు.