ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో బీజేపీ శక్తిగా ఎదుగుతుంది:జీవీఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన అవసరం తమకు లేదని, దేశంలో మోదీ, అమిత్‌షా ద్వయం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని అన్నారు. చంద్రబాబు ఎన్నడూ కూడా ఒంటరిగా పోటీ చేసి గెలుపొందలేదని, రెండుసార్లు బీజేపీ పొత్తు వల్ల సీఎం అయ్యారని అన్నారు. చంద్రబాబుకి సిద్ధాంతం కానీ ఒక విధానం అంటూ ఏదీ లేదని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను 1.7 నుంచి 2.7 ట్రిలియన్ డాలర్లకు పెంచామని అన్నారు. ఇపుడు 5 ట్రిలియన్ డాలర్ల పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.