జాతీయ వార్తలు
అసదుద్దీన్ వ్యాఖ్యలపై రాజ్నాథ్కు ఫిర్యాదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 July 2016
దిల్లీ: దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తెలంగాణ భాజపా నాయకులు దిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్కు శనివారం ఫిర్యాదు చేశారు. ఒవైసీ ఉగ్రవాదులకు న్యాయసహాయం చేస్తామనడం సరికాదన్నారు. హైదరాబాద్లో ఉగ్రవాదులకు ఎంఐఎం సహకరిస్తోందని ఆరోపించారు. అసదుద్దీన్పై చర్యలు తీసుకోవాలని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. భాజపా నాయకులు కిషన్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బద్దం బాల్రెడ్డి తదితరులు రాజ్నాథ్సింగ్ను కలిశారు.