తెలంగాణ
కేంద్రంపై నిందలు సరికాదు: లక్ష్మణ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 30 June 2016
హైదరాబాద్: హైకోర్టు విభజన జరగలేదని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ నిందించడం సరికాదని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. గతంలో పలుసార్లు కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సిఎంలు హైకోర్టు విభజనపై మాట్లాడుకోకపోడం ఎవరి తప్పని ఆయన ప్రశ్నించారు. ఏపిలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం వందకోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఇకనైనా కెసిఆర్, చంద్రబాబు కలుసుకుని హైకోర్టు విభజన కోసం గట్టిగా ప్రయత్నించాలన్నారు. తెలంగాణ న్యాయవాదుల ఆందోళనకు తమ పార్టీ మద్దతిస్తోందన్నారు.