జాతీయ వార్తలు

ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే బోపయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: రేపు జరుగనున్న బల పరీక్షకు ముందు కర్ణాటకలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను నియమించారు. గతంలో బోపయ్య వ్యవహారశైలిని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. సభలో అత్యంత సీనియర్‌గా ఉన్న సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలనే నిబంధన ఉన్నా గవర్నర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్ విమర్శించింది. విరాజ్‌పేట్ నుంచి బోపయ్య గెలిచారు. తమ ఎమ్మెల్యే దేశ్‌పాండేను పక్కన బెట్టడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.