తెలంగాణ

న్యూడెమోక్రసీ కార్యదర్శి బోస్‌కు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 10: సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్‌చంద్ర బోస్ అలియాస్ రవన్నకు ఖమ్మం జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు, అభిమానులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. బుధవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్‌లో మరణించిన ఆయన మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రానికి తరలించారు. ఆయనను కడసారి చూసేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల్లోని ప్రధాన నేతలు కూడా భారీగా తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎన్డీ జాతీయ కార్యదర్శి యతీంద్రకుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతో పాటు అన్ని పార్టీల ప్రధాన నేతలు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. 48 సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని నేతలు వెల్లడించారు. గురువారం ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.