బిజినెస్

గోఎయిర్ రూ. 999 ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 21: ప్రయాణికులను ఆకర్షించడానికి దేశీయ విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా గోఎయిర్ సంస్థ పరిమిత కాలవ్యవధితో 999 రూపాయలకే టిక్కెట్‌ను పరిచయం చేసింది. ఓ ప్రకటన ద్వారా బుధవారం సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ‘క్రిస్మస్ క్యాంపెయిన్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో గోఎయిర్ విమానాలు నడుస్తున్న మార్గాల్లో వచ్చే నెల జనవరి 9 నుంచి ఏప్రిల్ 17 వరకు 999 రూపాయల కనిష్ట ధరకే ప్రయాణించే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ నెల 31లోగా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గోఎయిర్ వెబ్‌సైట్, గోఎయిర్ టిక్కెట్ కౌంటర్లు, గోఎయిర్ కాల్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్ల వద్ద టిక్కెట్లు లభిస్తాయి. పరిమిత సీట్లను కలిగిన ఈ ఆఫర్‌లో ఎవరైతే ముందు టిక్కెట్లను బుక్ చేసుకుంటారో వారికే ప్రాధాన్యం ఇస్తామని గోఎయిర్ స్పష్టం చేసింది. ఆయా మార్గాల ఆధారంగా ధరలుంటాయన్న సంస్థ.. ప్రయాణికులు ఈ ఆఫర్‌కు అనుగుణంగా తమ హాలిడే టూర్లను ప్లాన్ చేసుకోవచ్చంది.