బిజినెస్

ఎపిఎస్‌డబ్ల్యుసి డివిడెండ్ రూ. 6 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎపిఎస్‌డబ్ల్యుసి) మూడేళ్లకుగాను ప్రభుత్వానికి 6 కోట్ల రూపాయల డివిడెండ్‌ను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17 తోపాటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాలైన 2014-15, 2015-16లకు సంబంధించి ఈ 6 కోట్ల రూపాయల ఇంటీరియం డివిడెండ్ చెక్కును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కును అందజేశారు. గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టులు, నూతనంగా చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా వివరించారు. ఎపిఎస్‌డబ్ల్యుసి కొత్త ప్రాజెక్టులపట్ల ఆనందం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు.. ప్రసాద్ నేతృత్వంలో గిడ్డంగుల సంస్థ బాగా పని చేస్తున్నదని అభినందించారు.

ఎపి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 6 కోట్ల రూపాయల డివిడెండ్ చెక్కును అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్