బిజినెస్

అనామకుడి ఖాతాలో రూ. 17 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: ఓ అనామకుడి ఖాతాలో రూ. 17 కోట్లు జమ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఒకే ఖాతా ద్వారా చెల్లింపులు నిర్వహిస్తూ పన్నులు ఎగవేస్తున్న ఆ అనామకుడిని ఐటి శాఖ అధికారులు బయటపెట్టారు. నిరుడు నవంబర్ 8న పాత పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత హైదరాబాద్ నాంపల్లిలోని ఒక బ్యాంక్ ఖాతాలో రూ. 17 కోట్లు జమ అవడాన్ని ఆదాయపు పన్నుల శాఖ అధికారులు గమనించారు. ఖాతాదారుడిని పిలిచి విచారిస్తే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఖాతా తన మిత్రుడు నిర్వహిస్తుంటాడని సదరు వ్యక్తి వెల్లడించాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం డబ్బు జమ చేసిన వ్యక్తిని పిలిచి విచారించగా, ఆ వ్యక్తి ముక్తియార్ గంజ్‌లో ధాన్యం వ్యాపారుల వద్ద లెక్కలు రాసే వాడని తేలింది. అతణ్ని ఆదాయ పన్నుల అధికారులు మరింత లోతుగా విచారించినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. అతడి ఖాతాలో వేసినట్టే ముక్తియార్ గంజ్, మహరాజ్‌గంజ్, బేగం బజార్‌లోని కొందరు వ్యాపారులు ఎవరో ఒక అనామకుడి ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నారు. ఆ వెంటనే నగదును లాతూర్, ఉద్గిరి, అకోల తదితర ప్రాంతాల్లోని సరఫరాదారుల ఖాతాల్లోకి ఆర్టీజిఎస్ ద్వారా మళ్లిస్తున్నారు. డబ్బు ముట్టిన వెంటనే సరఫరాదారులు హైదరాబాద్‌లోని వ్యాపారులకు సరుకు పంపిస్తున్నారు. ఈ సరుకుకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఇక్కడ అమ్మేసుకుంటున్నట్టు ఐటి అధికారులు గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
వాస్తవానికి ఏ వ్యాపారికి సరుకు కావాలంటే అదే వ్యాపారి తన ఖాతా ద్వారా నగదు చెల్లించాలి. అదే వ్యాపారి పేరుతో సరకు సరఫరా జరగాలి. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా నగదు బదిలీ అయ్యే ఖాతాకి, సరుకు సరఫరా అయ్యే వ్యాపారులకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా పన్ను చెల్లింపులను తప్పించుకునే అక్రమ వ్యాపారంగానే ఆదాయపు పన్ను శాఖ తేల్చింది. ఇలాంటి ఖాతాలు, వ్యాపారులు ఇంకా అనేకం ఉన్నట్టు గుర్తించిన ఐటి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు.