బిజినెస్

విశాఖ నుంచి ఎయిర్ ఇండియా కొత్త సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిం డియా.. విశాఖ నుంచి కొత్తగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నది. ఏప్రిల్ 1 నుంచి ఎటిఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా విశాఖ కేంద్రంగా ఈ సర్వీసులు నడపనున్నారు. ఒక్క బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు ఈ నూతన విమాన సర్వీసులు నడుస్తాయి. విశాఖపట్నంలో ఉదయం 6.30 గంటలకు బయలుదేరే ఎఐ 9527 విమాన సర్వీసు.. విజయవాడ మీదుగా ఉదయం 9.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి ఎఐ 9528 సర్వీసు విమానం ఉదయం 9.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి విజయవాడ మీదుగా ఉదయం 11.55 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. అలాగే విశాఖలో మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరే ఎఐ 9533 విమాన సర్వీసు భువనేశ్వర్‌కు మధ్యాహ్నం 1.50 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. విశాఖలో సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరే ఎఐ 9535 విమాన సర్వీసు.. రాయ్‌పూర్‌కు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.25 గంటలకు రాయ్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు విశాఖకు వస్తుంది. విశాఖలో ఉదయం 10.45 గంటలకు బయలుదేరే ఎఐ 9537 విమాన సర్వీసు.. విజయవాడ మీదుగా మధ్యాహ్నం 1.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీసు బుధవారమే నడుపుతారు.